Thursday 11 January 2018
Monday 8 January 2018
Sunday 7 January 2018
Suryapet district elections
*హైదరాబాద్*
*తెలంగాణ108ఉద్యోగులసంఘం* ఆద్వర్యంలో *సూర్యపేట* జిల్లాలో వున్న *ప్రతి ఉద్యోగి* ఓటింగ్ లో పాల్గొని జిల్లాలో నూతన అద్యక్ష , కార్యదర్శులను ఎన్నుకోవడం జరిగింది.
జిల్లా అద్యక్షునిగా *గందం నగేష్* ,కార్యదర్శిగా *జాటంగి సైదులు* , వైస్ ప్రెసిడెంట్ గా *నక్క శ్రీనివాస్* , ట్రెసరర్ గా *షేక్ ముజీబ్* లను ఎన్నుకోవడం జరిగింది.
*హైలెట్స్*
👉 *ప్రతి ఉద్యోగి తన ఓటు హక్కును వినియెూగించుకోవడం*
👉 *యూనియన్ పరంగా ప్రతి ఉద్యోగిని టచ్ చేయడం*.
*తెలంగాణ108ఉద్యోగులసంఘం*
*రాష్ట్ర కమిటి*
We met our honorable CM sir on 01.01.2018
*హైదరాబాద్*
👉 *108 ఉద్యోగ మిత్రులకు*
*తెలిజేయు విషయం*
*తెలంగాణ108ఉద్యోగులసంఘం* ను ఏ లక్ష్యాల సాదనకోసం ఏర్పాటు చేశామెు.
👉ఆ లక్ష్యల సాదనకు 7మందితో ప్రారంభమైన మన అసోషియేషన్ నేడు 1000 మంది సభ్యులకు చేరుకుంది.
*తెలంగాణ108ఉద్యోగులసంఘం* అనేది ఉద్యోగులకు ఏమి కావాలో వాటిని ఎలా సాదించాలో అన్నదానిపై పూర్తిస్థాయిలో అవగాహణ కలిగిన సంఘం.
👉గతంలో ఏ యూనియన్ కు ,ఏ అసోషియేషన్ కు సాద్యం కాని విదంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారిని 2సార్లు కలవడం జరిగింది.
👉 *మెుదటగా మార్చ్ 14 2017న* కలవడం జరిగింది.
మన అసోషియేషన్ ఆద్వర్యంలో మార్చ్ 7 2017న ఇందిరా పార్క్ దగ్గర దాదాపు 450 మందితో
👉 *సేవకు సై పోరుకు జై*
అన్న నినాదంతో దర్న చేయడం జరిగిందిదాని తరువాత *మనకు పిలుపు రావడంతో*
గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది.
*15, 16 మార్చ్ రెండు రోజులు ప్రగతి భవన్* లోనే ఉండి ముఖ్యమంత్రి గారితో మాట్లాడితె మీకు న్యాయం చేస్తాము అని *16న 4000 రూపాయల పెంపుకు ఆమెూదం తెలపడం జరిగింది.*
దాని తరువాత మిగిలి ఉన్న మన సమస్యలపై *పేపరు రూపకంగా, డైరెక్ట్ గా* లేబర్ కమీషనర్ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు అందరిని కలిసి ప్రతిఒక్కరికి లెటర్స్ ఇచ్చి మళ్ళి వాటిపై అందరితో కలి మాడటం జరిగింది.
నవంబర్ 16న మనం మన *తెలంగాణ108ఉద్యోగులసంఘం* తరపున మీటింగ్ పెట్టి మనం చేస్తున్న పనులపై మద్యాహ్నం 1.20 నుండి రాత్రి 9.25 నిమిషాల వరకు వివరించడం జరిగింది.
👉నవంబర్ న ఉద్యోగుల కోసం వెబ్ సైట్ ను ఆవిష్కరించాము.
దాని ఉపయెూగం గురించి వివరించాము.
👉ఉద్యోగుల హక్కుల సాదన కోసం నిరంతరం పోరాడుతూనే ఉన్నం.
👉అపస్మారక స్థితిలోకి వెళ్ళి మన మరికల్ పైలట్ విజయ్ ప్రసాద్ గారికి 50,000 ఆర్దిక సహాయం అందజేసాం.
👉సరూర్ నగర్ పైలట్ నగేష్ గారి కుటుంబానికి తక్షణ ఖర్చుల నిమిత్తం 5000 అందించడం జరిగింది.
👉 *అవకాశం కల్పించుకొని*
*జనవరి 1 2018న మన గౌరవ ముఖ్యమంత్రి* *గారినికలిసి* మన *తెలంగాణ 108 లో పనిచేస్తున్న ఉద్యోగులందరి* *సమస్యలపై , వినతి పత్రం ఇచ్చి వివరించడం జరిగింది* .
👉 *మన సమస్యలపై గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అత్యంత సానుకూలంగ స్పందించారు.*
👉 *మనకు ఒక స్పష్టమైన హామినీ ఇవ్వడం జరిగింది*
మన *తెలంగాణ108ఉద్యోగులసంఘం*
*ప్రధాన మెుదటి లక్ష్యం* ఏంటో అందరికి తెలుసు.
👉 *దానితోపాటు మిగిలిన మూడు విషయాలపై దాదాపు 35 నిమిషాలపాటు చర్చించడం జరిగింది.*
అవి ఏమిటి అనేది మీటింగ్ లో చెపుతాము.
👉 *1 జనవరి 2018 మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల స్పందన సూపర్* .
👉 *అతి తొందరలోనే మనకు మంచి రోజులు*
👉 *అతి త్వరలోనే మరో బేటి*
👉 రాబోయే రోజులు చాల కీలకమైని మనమందరం మన యూనిటిని చాటుదాం.
*108* *ఉద్యోగుల ఐక్యత వర్దిల్లాలి*
*తెలంగాణ108ఉద్యోగులసంఘం*
*రాష్ట్ర కమిటి*
VIKARABAD DISTRICT ELECTIONS
గౌ శ్రీ. *అశోక్ పల్లె* గారి ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా 108 యూనియన్ అధ్యక్షునిగా _Md వస్సీయోద్దిన్_ గారిని ఏకగ్రవంగా ఎన్నుకున్నారు.
అలాగే జనరల్ సెక్రటరీగా _E. చందు గౌడ్_, మరియు కోశాధికారిగా _S. సురేష్ రావు_ గార్లనీ కూడా ఏకగ్రవంగా ఎన్నుకోవడం జరిగింది.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌ శ్రీ Md షబ్బీర్ అహ్మద్ ( సీనియర్ ట్రేడ్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్) గారు అలాగే తెలంగాణ 108 ఉద్యోగుల సంఘం నాయకులు మరియు వికారాబాద్ జిల్లా EMT, PILOT లు హాజరు అయ్యారు.
Rs.5000 helped to Saroornagar PILOT Nagesh
*ప్రభుత్వ పథకమైన 108 అంబులెన్స్ సర్వీస్లో పనిచేస్తు వచ్చే చాలిచాలని జీతంతో కుటుంబాన్ని పోషించలేక ,* *ఉన్న చిన్నపాటి అప్పులను తీర్చలేక తీవ్రమైన మనోవేదనకు గురై తనువు చాలించిన సరూర్ నగర్* *పైలెట్ నగేష్ అన్నగారి కుటుంబానికి తక్షణ సాయంగా* *తెలంగాణ108ఉద్యోగులసంఘం తరపున 5000* *రూపాయలను వారి కుటుంబ సబ్యులకు అందజేయడం* *జరిగింది.ఈ సందర్బంగ నగేష్ అన్న కుటుంబానికి ప్రగాడ సానుబుతిని తెలియజేసాము.*
*ఈ కార్యక్రమంలో రాష్ట్ర అద్యక్షులు అశోక్ పల్లె , శ్రీనివాస్ , ప్రవీణ్ , మహెందర్ , పప్పుల వెంకన్న ,సదానందం , అశోక్ , నరేష్ , ఆఫీస్ సెక్రెటరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.*
Achampet ambulance staff conducted delivery
తేదీ18.12.2017 మంగళవారం రాత్రి 8:30 సమయంలో మహేశ్వరి అనే మహిళ,,వయస్సు 22 సంవత్సరాలు. గ్రామం:చిట్లంకుంట.మొదటి కాన్పు. అచ్చంపేట ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో 108 అంబులెన్స్ లోనే ప్రసవం జరిగి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ బాల్ నారాయణ తగిన చికిత్స అందించారు.తల్లి, బిడ్డను పైలెట్ వాహద్అలీ అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Subscribe to:
Posts (Atom)